ఆ హీరోయిన్ కి బిసిలేరి నీరు కావాలంట.? అందులో వింత ఏముంది.? హీరోయిన్లు అంటే బిసిలేరి వాటర్ తాగడం కామన్ ఏ కదా అనుకుంటున్నారా.? తాగడానికి కాదండోయి స్నానం చేయడానికి ఆ హీరోయిన్ బిసిలేరి వాటర్ ని డిమాండ్ చేస్తుంది.ఏదో లంచ్ లో మెనూ డిమాండ్ చేయడం…స్టార్ హోటల్ లో రూమ్ బుక్ చేయమని డిమాండ్ చేయడం గురించి మనకి తెలిసిందే…కానీ స్నానం చేయడానికి బిసిలేరి వాటర్ అడిగిన హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా.? నటి శ్రీవిద్య మాత్రం స్నానం చేయడానికి కూడా బిస్లరీ వాటర్ తీసుకురమ్మని చెప్పేవారట.

తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ఓ తెలుగు సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్లాల్సి వచ్చిందట.అక్కడ ఓ గ్రామంలో ఉండడానికి ఏర్పాట్లు చేశారు.అన్నీ బాగానే ఉన్నా.స్నానాలు మాత్రం గోదావరి నీళ్లతో చేయాల్సి వచ్చిందట.వరదల కారణంగా నీళ్లు బురదగా ఉండడంతో స్వచ్ఛమైన నీరు పైకి వచ్చేలా చేసి స్నానం కి ఉపయోగించేవారు.యితే శ్రీవిద్య మాత్రం తను ఆ నీటితో స్నానం చేయనని.
తన శరీర సౌందర్యం, ఆరోగ్యం దెబ్బ తింటాయని గొడవ చేసేవారట.దాంతో అందరికీ తాగడానికి తెప్పించే బిస్లరీ వాటర్ ని బకెట్లలో పోసి ఇవ్వమన్నారట.
అప్పుడే మార్కెట్ లోకి వచ్చి బిస్లరీ వాటర్ లీటర్ సీసా ఆరు రూపాయలు.రెండు బకెట్లు నిండే వరకుబిస్లరీ వాటర్ పోసి శ్రీవిద్య స్నానానికి అందించేవారట.
.






