ఏపీ కి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి పోలవరం సందర్శించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ పర్యటనలో గడ్కరి తో పాటుగా చద్రబాబు కూడా దగ్గరుండి మరీ అన్ని విషయాలు వివరించారు.అయితే పర్యటన ముగించిన మంత్రి మీడియా ముందు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలు మొదట ఏపీ బిజేపీ నేతలని ఆశ్చర్య పరచడమే కాకుండా గడ్కరీ మాటలకి అందరికి షాక్ కొట్టింది.దాంతో ఏపీ లో రాజకీయ పార్టీలు మొదలు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అయితే చివరలో చిన్న చురక అంటించారు కూడా.ఇంతకీ గడ్కరీ ఏమన్నారు.
చివరిలో బాబు కి ఇచ్చిన షాక్ ఏమిటి అంటే.
పోలవరం టూర్ లో గడ్కరీ తో రాసుకు పూసుకు తిరిగిన బాబు గడ్కరీ కి అన్ని పనులు వివరిస్తూ అన్ని దగ్గర ఉండి మరీ చూసుకున్నారు.
అయితే గడ్కరీ మీడియా తో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అద్భుతమైన పురోగతి సాధించారని.నేను పోయిన సారి వచ్చినప్పటికీ ఎంతో డెవలప్మెంట్ జరిగిందని బాబు పై ప్రసంసలు కురిపించారు…అంతేకాదు రిమార్కబుల్ అంటూ బాబు ని మెచ్చుకున్నారు.
ఎంత పెద్ద మిషనరీ ఉన్నా, వనరులు ఉన్నా, చంద్రబాబు లాంటి పట్టుదల ఉన్న వారు ఉంటేనే, ఇలాంటి ప్రాజెక్ట్ లు పూర్తవుతాయి అన్నారు.
అయితే ఇంతకు ముందే పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించాల్సి ఉంది.కానీ మీకు అందరికి తెలుసు నా సమస్యలు అంటూ సెటైర్ వేశారు.నీటి సదుపాయం ఉంటే ఎంత మేలు జరుగుతుందో రైతుగా తనకు తెలుసునని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.ఏప్రిల్ నాటికి సివిల్స్ వర్క్స్ పూర్తిచేస్తామని అధికారులు అన్నారని, ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని సూచించానన్నారు.
అయితే ఇప్పటి వరకూ బాగానే సాగిన గడ్కరీ ప్రసంగం చివరిలో మారిపోయింది.
చంద్రబాబు ని ఎంతగా పొగిడినా గడ్కరీ టూర్ వేసినా ఇదంతా పక్క ప్రణాళిక లో భాగంగా సాగే తంతు అని అందరికీ తెలిసిందే మోడీ షా లని కాదని అక్కడ ఏమి జరుగదు.అయితే గడ్కరీ చివరిగా మాట్లాడుతూ పోలవరం అభివృద్ధి గురించి మాత్రమే నేను మాట్లాడాను తప్ప మిగిలిన అంశాలు మాత్రం ఎప్పటిగాలానే నడుస్తాయి దీన్ని రాజేకీయలతో ముడిపెట్టకండి అంటూ చెప్పేసరికి ఈ సారి షాక్ అవ్వడం బాబు వంతు అయ్యింది దాంతో ఏపీ బిజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
ఎంతన్నా కేంద్రం కదా ఎక్కడ నొక్కాలో ఎక్కడ పోగాడాలో బాగా తెలుసు అంటున్నారు విశ్లేషకులు
.