ర‌వితో విబేధాల‌పై లాస్య చెప్పిన నిజాలు

బుల్లితెర మీద యాంకర్లు హాట్‌ హాట్‌గా చెలరేగిపోతున్న దశలో కూడా పద్ధతిగా, సాంప్రదాయ వస్త్రధారణలోనే యాంక‌రింగ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది లాస్య‌.

త‌న కో యాంక‌ర్ ర‌వితో లాస్య‌ది సూప‌ర్ హెట్ ఫెయిర్‌.

వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఎన్నో ప్రోగ్రామ్స్ బుల్లితెర మీద సూప‌ర్‌హిట్స్ అయ్యాయి.ఆ త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో విబేధాలు త‌లెత్తాయి.

వీరిద్ద‌రు క‌లిసి యాంక‌రింగ్ కూడా చేయ‌లేదు.ర‌వి ప‌క్క‌న శ్రీముఖి వ‌చ్చి చేరింది.

తాజాగా లాస్య ర‌వితో వ‌చ్చిన విబేధాల‌పై స్పందించింది.ఓ స్థాయికి వెళ్లాక ఎవ‌రిలో అయినా చేంజ్ వ‌స్తుంద‌ని.

Advertisement

ర‌వి నేను నీకు లైఫ్ ఇచ్చాన‌న్న‌ట్టుగా మాట్లాడాడ‌ని ఆమె వాపోయింది.భవిష్యత్తులో ఇక రవితో కలిసి యాంకరింగ్‌ చేసేది లేదని స్పష్టం చేసింది.

ఇక‌ రవికి, నాకు మధ్య ఏదో ఉందని వార్తలు త‌న‌తో పాటు త‌న కుటుంబ స‌భ్యుల‌ను చాలా ఇబ్బంది పెట్టాయ‌ని లాస్య చెప్పింది.ఆ రూమ‌ర్ల‌కు ఫుల్ స్టాప్ పెట్టేందుకే తాను భ‌విష్య‌త్తులో ర‌వితో క‌లిసి ప‌ని చేయ‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యాన‌ని ఆమె తెలిపింది.

ఇక త‌న‌కు కాబోయే భ‌ర్త మంజునాథ్‌తో ఏడేళ్లుగా త‌న ప్రేమ వ్య‌వ‌హారం కొన‌సాగుతోంద‌ని.పెళ్లి చేసుకునేందుకే తాను యాంక‌రింగ్‌కు బ్రేక్ ఇచ్చాన‌ని.

మార్చి నుంచి యాంక‌రింగ్ తిరిగి స్టార్ట్ చేస్తాన‌ని లాస్య చెప్పింది.

మరో బాహుబలి వస్తుందని ప్రకటన చేసిన రాజమౌళి.. ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ అంటూ? 
Advertisement

తాజా వార్తలు