చాలా మందికి పాము అంటేనే భయం.అది విషయం ఉన్నది అయినా సరే లేనిది అయినా సరే కనిపిస్తే చాలు కేకలు వేస్తూ ఆమడ దూరం పరిగెడుతుంటారు.
మరికొందరు కాస్త ధైర్యం చేసి వాటని పెద్ద పెద్ద కర్రలతో చంపాలని చూస్తుంటారు.అయితే పాము ఏమాత్రం పెద్దగా ఉన్న భయంతో పణికిపోతూ… పాములు పట్టే వాళ్లకు సమాచారం ఇస్తుంటారు.
అయితే తాజాగా కర్టాటక రాష్ట్రంలోని చామరాజ నగర్ లో ఓ భారీ కొండ చిలుసవ స్థానిక ప్రజలను హడలెత్తించింది.బెలవట్టలోని డా రాజేంద్రకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో… 14 అడుగుల కొండ చిలువ కనిపించింది.
అక్కడే ఉన్న కూలీలు కేకలు వేస్తూ… పరుగులు పెట్టారు.ఆ దగ్గర్లోకి వెళ్లేందుకు కూడా తీవ్రంగా భయపడిపోయారు.
అయితే కొందరు విషయాన్ని యజమానికి తెలిపారు.
వెంటనే ఆయన పాములు పట్టే వ్యక్తి సమాచారం ఇవ్వగా… వెంటనే రంగంలోకి దిగాడు.దాదాపు గంటసేపు శోధించి… 14 అడుగుల పొడువు ఉన్న పామును కనిపెట్టాడు.100 కిలోలకు పైగా బరువున్న దాన్ని పట్టుకొని… ట్రాక్టర్ లోకి ఎక్కంచాడు.దీని కోసం ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది.ఎందుకంటే పాము క్వింటాళుకు పైనే బరువుంది.అందులోనూ అది కొండ చిలువ.పామును ట్రాక్టర్ లోకి ఎక్కించన తర్వాత బిళిగిరి రంగనాథ ఆలయ టైగర్ రిజర్వ్ అడువల్లోకి తీసుకెళ్లారు.
అక్కడే ఆ పామును వదిలి పెట్టారు.అయితే ఇంత పెద్ద పామును పట్టుకోవడం ఇదే మొదటి సారి అని పాములు పట్టే వ్యక్తి తెలిపాడు.