నల్లగొండ జిల్లా:రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 3 నుంచి 13 వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ శాఖల అధికారులతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది లాగే ఈ సంవత్సరం కూడా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నారని అన్నారు.
పరీక్షల నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.