హైదరాద్ లో దారుణం..మహిళా టెకీ పై అత్యాచారం ఆపై..

హైదరాబాద్ లో అభివృద్ధి పరుగులు పెడుతుందో లేదో అనే విషయం పక్కనపెడితే నేరాలు ఘోరాలలో మాత్రం దూసుకుపోతోందని చెప్పచ్చు.

ఒక పక్క హుక్కా సెంటర్స్ పేరుతో యువత జీవితాలు బలై పోతుంటే మరో పక్క ఇంకోపక్క పబ్బులు పేరుతో మత్తు మందు గంజాయి అలవాటి పడిన యువత తీవ్రంగా నష్టపోతోంది.

ముఖ్యంగా మహిళలలని నమ్మించి మోసం చేసి మరీ అత్యాచారాలు చేస్తున్నారు.

అయితే కొందమంది బయట చెప్పుకుంటున్నారు మరి కొంత మంది ఆ పరువుపోతుండానే భయంతో లోలోపల కుమిలిపోతున్నారు.అయితే తాజాగా జరిగిన ఇలాంటి ఘటనే సంచలనం సృష్టించింది.వివరాలలోకి వెళ్తే.

హైదరాబాద్ నగరంలోని మయూర్ పాన్ హౌస్ యజమాని అయిన ఉపేందర్ వర్మ, ఫేస్‍బుక్ రిక్వెస్ట్స్ పంపి అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉంటాడు.తనదగ్గరకి వచ్చిన అమ్మాయిలని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటాడు ఉపేంద్ర ఈ క్రమంలోనే వారికి మాయమాటలు చెప్తూ స్వీట్ పాన్ ఇస్తాడు ఈ కిళ్లీలో మత్తు మందు కలిపి ఇచ్చి అమ్మాయిలపై అత్యాచారం చేస్తూ ఉంటాడు.

Advertisement

అయితే ఈ కామాంధుడి ఉచ్చులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలైపోయింది.ఆమెకి కూడా ఇలాగే కిళ్ళీ ఇచ్చి అత్యాచారం చేశాడు అంతేకాదు రహస్యంగా వీడియోలు తీసి యూట్యూబ్‌లో వీడియోలో అప్లోడ్ చేస్తానని అని బెదిరించి పలుసార్లు లోబరుచుకునేవాడు.

అయితే ఇలా ఎంతోమంది అతడి అక్రమాలకి బలై పోగా ఒక మహిళా టెకీ మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చింది.అతడిపై కాచిగూడ పోలీసులను ఆశ్రయించింది.

నిందితుడు చేసిన అక్రమాలకి గాను పోలీసులు అతడిపై రేప్ మరియు చీటింగ్ కేసు మరియు పలు కేసులు నమోదు చేశారు.అతడిపై చర్యలు తీసుకుంటామని ఆమెకి న్యాయం చేస్తామని తెలిపారు పోలీసులు.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Advertisement

తాజా వార్తలు