వైకాపా ఎమ్మెల్యేల అధికార విలాసం చూశారా?

జ‌గ‌న్ నేతృత్వంలోని వైకాపా ఇప్పుడు విప‌క్షంలో ఉన్న విష‌యం తెలిసిందే.

అయితే, 2014 ఎన్నిక‌ల్లో తామే అధికారంలోకి వ‌చ్చి తీర‌తామ‌ని ప్ర‌గాఢ న‌మ్మ‌కంతో ఉన్న వైకాపా అధినేత జ‌గ‌న్‌, ఆయ‌న పార్టీ నేత‌లు ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్ దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.

అయినా.కూడా ఆ పార్టీ నేత‌లు మాత్రం అప్పుడ‌ప్పుడు అధికారంలో ఉన్న‌ట్టే ఫీలైపోతుంటార‌ని టాక్‌.

ఇక‌, జ‌గ‌న్ ఎక్క‌డ మీటింగ్ పెట్టినా.మా ప్ర‌భుత్వం.

వ‌చ్చాక‌.అంటూ స్టార్ట్ చేస్తాడు.

Advertisement

సో.వాళ్లు.అధికారంలో లేక‌పోయినా.

ఉన్నామ‌నే ఫీలింగ్‌తో రోజులు నెట్టుకొస్తున్నార‌న్న‌మాట‌.తాజాగా.

ఈ పిచ్చి మ‌రింత పీక్ స్టేజ్‌కి వెళ్లింది! త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధులు ఇవ్వ‌డం లేద‌ని పేర్కొంటూ మొన్నామ‌ధ్య సీఎం చంద్ర‌బాబును క‌లిశారు వైకాపా ఎమ్మెల్యేలు.ఈ సంద‌ర్భంగా వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యానికి వెళ్లిన వైకాపాకు చెందిన 32 మంది ఎమ్మెల్యేలు త‌మ స్టైల్లో అధికారంలోకి వ‌చ్చేసిన‌ట్టు ఊహించేసుకున్నార‌ని తెలిసింది.

అంతేకాదు, ఒక‌రిద్ద‌రు.తాము మంత్రుల‌మైతే.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

ఎక్క‌డెక్క‌డ కూర్చుంటామో కూడా చెప్పుకొచ్చారు.ఇదంతా ఆఫ్‌ది రికార్డుగానే జ‌రిగినా.

Advertisement

మీడియా మిత్రుల చెవుల‌కు చేరిపోయింది.దీంతో వైకాపా ఎమ్మెల్యేల అధికారం విలాసంపై తాజాగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

మీరు మంత్రి అవ్వడం ఖాయం అంటూ ఓ మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి మరో వైకాపా మహిళా ఎమ్మెల్యే జోస్యం చెప్పారు.దీనికి మరికొందరు ఎమ్మెల్యేలు అవుననేశారు.

మీరు కూర్చునే కుర్చీ ఇక్కడ ఉంటుందంటూ ప్లేస్‌ను కూడా చూపించారు.ఇలా కాసేపు అధికారంలో ఉన్నట్టుగా ఊహించేసుకుని ఆనందపడిపోయారు.

మొత్తానికి రికార్డు సమయంలో సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారంటూ కితాబిచ్చారు.హైదరాబాద్‌లోని స‌చివాల‌యంలా కాకుండా సువిశాల ప్రాంగణంలో సెంట్రల్‌ ఎయిర్‌ కండీషన్‌తో బ్రహ్మండమైన ఫర్నిచర్‌తో ఏర్పాటు చేశారంటూ గుసగుసలాడుకున్నారు.

మొత్తానికి ఈ వైకాపా ఎమ్మెల్యేల సంభాష‌ణ ఆసాంతం హాస్యం పుట్టించింది!.

తాజా వార్తలు