టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్

టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.టీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్లు కట్టే ప్రభుత్వం కాదని విమర్శించారు.

ఈ సర్కార్ పేదలకు పెన్షన్ ఇచ్చేది కాదని ఆరోపించారు.వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు తెలంగాణలో మళ్లీ అమలు కావాలని చెప్పారు.

ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం రావాలని షర్మిల అన్నారు.వైఎస్ఆర్ టీపీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యాన్ని నిర్మిస్తామని తెలిపారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందేలా చూస్తామని షర్మిల హామీ ఇచ్చారు.

Advertisement
Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!