వైసీపీ నవరత్నాలను కాపీకొట్టిన టీడీపీ.. విజ‌యసాయిరెడ్డి విమ‌ర్శ‌లు.. ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే.10 అంశాలతో కూడిన ఈ ఎన్నికల మేనిఫెస్టో లో పేదలకు ఐదు రూపాయలతో నాణ్యమైన భోజనం.

ఆటో డ్రైవర్ల కోసం ఆటో స్టాండ్‌లు.

ప్రతీ వీధిలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.కాగా ‌ టీడీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టో పై వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.వైసీపీ ప్రకటించిన న‌వ‌ర‌త్నాల‌ను టీడీపీ కాపీ కొట్టిందని చెప్పుకొచ్చారు.

ఇలా వైసీపీ నవరత్నాలను కాపీకొట్టిన టీడీపీ ఏదో కొత్తగా మేనిఫెస్టోను తయారు చేసినట్లుగా డప్పుకొట్టుకుంటుదని ఎద్దేవా చేశారు.కాగా ఈ మేనిఫెస్టో పేరు పల్లెలు గెలిచాయి, ఇప్పుడిక మనవంతు అంట.అవును టీడీపీని చిత్తు చేయడం ఇప్పుడు పట్టణాలు, నగరాల వంతే అంటూ, పప్పు నాయుడూ జరగబోయేది కూడా ఇదే అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు టీడీపి పైన.

.

Advertisement

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు