పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన వైసిపి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైసిపి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఆయన సన్నిహితురాలు శాంతకుమారి పార్టీ కార్యాలయానికి సంబంధించి ఏర్పాట్లన్నీ చేశారు.

పార్టీ ఆఫీస్ తో పాటు కుర్చీలు, సోఫాలు కూడా ఎమ్మెల్యే ఆవిష్కరించారు.వాటికి ఏర్పాటు చేసిన రిబ్బన్ లను ఎమ్మెల్యే కట్ చేశారు.

అయితే కుర్చీలు, సోఫాలకు కూడా రిబ్బన్ కట్ చేయడంతో అక్కడకు వచ్చిన కార్యకర్తలు, నాయకులు అంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.కుర్చీలు సోఫాలను ఆవిష్కరించడం ఏంటంటూ.

వాళ్లకు వాళ్లే చర్చించుకున్నారు.పార్టీ ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ దీనిపైనే చర్చించుకుంటున్నారట.

Advertisement
ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!

తాజా వార్తలు