అక్కడి ప్రజలు స్లో పాయిజన్ బాధితులు!

రాజస్థాన్‌లోని భివాడి ట్రాఫిక్ పోలీసు సురేంద్ర సింగ్ తన చొక్కా విప్పాడు.దుమ్ము, ధూళిని దులిపాడు.

అతని ఛాతీకి అమర్చిన చిన్న పెట్టెను చూపించాడు.తరువాత అతను మాట్లాడుతూ.

ఇది నన్ను సజీవంగా ఉంచుతోంది.అని అన్నాడు.

సురేంద్రకు 48 ఏళ్లు.అతని ఛాతీ దగ్గర వేలాడుతున్న పరికరం పేరు కార్డియాక్ డిఫిబ్రిలేటర్.

Advertisement

అతని గుండె అసాధారణంగా కొట్టుకున్నప్పుడు ఈ పరికరం విద్యుదయస్కాంత తరంగాలను విడుదల చేయడం ద్వారా అతని హృదయ స్పందనను నియంత్రిస్తుంది.అతను ఇంకా మాట్లాడుతూ.

ఈ నగరంలో పని చేయడానికి నేను చెల్లిస్తున్న మూల్యం ఇది’ అని వాపోయాడు.ఇటీవల స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ IQAir మొత్తం 6,475 నగరాల్లో గాలి నాణ్యతను సర్వే చేసింది.

వీటిలో పారిశ్రామిక కేంద్రం భివాడి అత్యంత అధ్వాన్నంగా ఉన్నట్లు వెల్లడయ్యింది.ప్రపంచంలోనే అత్యంత కలుషిత ప్రాంతంగా భివాడి గుర్తింపు పొందింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ఈ నగరంలోని గాలిలో 20 రెట్లు అధికంగా కలుషిత గాలి కణాలు ఉన్నాయి.వీటిని PM2.5 అంటారు.ఈ కణాలు ఊపిరితిత్తులు, హృదయనాళ వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!

ఎక్కువసేపు కలుషిత గాలికి గురికావడం వల్ల ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.రక్తంలో ఆక్సిజన్ లోపం ఏర్పడుతుంది.

Advertisement

ఇది క్రమరహిత హృదయ స్పందనలకు దారి తీస్తుంది, ఛాతీ నొప్పికి దారితీస్తుంది.ట్రాఫిక్ పోలీస్ సురేంద్ర సింగ్ అస్వస్థతకు గురి కావడానికి కూడా ఇదే కారణం.

అతను ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటాడు.అలాగే ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోడు.

సురేంద్ర సింగ్ మాట్లాడుతూ చాలాకాలంగా తాను పొగ, దుమ్ము, విషపూరిత పారిశ్రామిక గాలిని పీల్చడం వల్ల దగ్గు, శ్వాసలోపం,ఛాతీ నొప్పితో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.