బ్యాంకు ద్వారం అద్దాల తలుపును ఢీకొట్టుకొన్న మహిళ.! చివరకు..?

మరణం ఎవరికీ ఎటువైపు నుంచి ఏ క్షణంలో వస్తుందో చెప్పలేము.

అప్పటివరకు మనతో పాటు కలియతిరిగి ఆనందంగా ఉన్న వ్యక్తి మరుక్షణంలో ప్రాణాలు వదిలిన సంఘటనలు కూడా చాలానే చూశాం ఇంతవరకు.

ఇలాంటి సంఘటనలు రోజుకు ప్రపంచంలో ఏదో ఒక మూలన జరుగుతూనే ఉంటాయి.ఇకఅసలు విషయంలోకి వెళితే.

కేరళలోని ఓ మహిళ పనిమీద బ్యాంకు దగ్గరికి వెళ్ళింది.అయితే అక్కడ ఆ మహిళ అద్దాల తలుపును ఢీకొని చనిపోయింది.

ఆ సన్నివేశాలన్నీ బ్యాంకు సీసీటీవీలో పూర్తిగా నమోదయ్యాయి.ఇకపోతే ఈ సంఘటన కేరళలోని ఎర్నాకుళం వద్ద ఉన్న పెరంబూరు చెందిన ఓ మహిళ కు జరిగింది.

Advertisement

ఆ మహిళ తన స్కూటర్ కి తాళం వేయలేదన్న సంగతి గుర్తుకు రావడంతో కంగారుగా బయటికి వెళ్లేందుకు ప్రయత్నం చేసింది.ఇక ఆ తొందరలో ఆమె అద్దాల డోర్ మూసి ఉన్న సంగతి గమనించక పోవడంతో ఆమె తలుపుని ఢీ కొట్టగానే వెంటనే ఆ అద్దాలు పగిలిపోయాయి.

అలా పగిలిపోయిన అద్దాల డోర్ నుండి ఒక పదునైన అద్దం ముక్క ఒకటి ఆమె కడుపు లోకి గుచ్చుకుంది.దింతో ఆ బ్యాంకులోని అధికారులు హుటాహుటిన ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినా ఫలితం కనపడలేదు.

ఆమె చికిత్స పొందుతూ హాస్పిటల్లో మరణించడం జరిగింది.దీనితో ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు