మరణం ఎవరికీ ఎటువైపు నుంచి ఏ క్షణంలో వస్తుందో చెప్పలేము.
అప్పటివరకు మనతో పాటు కలియతిరిగి ఆనందంగా ఉన్న వ్యక్తి మరుక్షణంలో ప్రాణాలు వదిలిన సంఘటనలు కూడా చాలానే చూశాం ఇంతవరకు.
ఇలాంటి సంఘటనలు రోజుకు ప్రపంచంలో ఏదో ఒక మూలన జరుగుతూనే ఉంటాయి.ఇకఅసలు విషయంలోకి వెళితే.
కేరళలోని ఓ మహిళ పనిమీద బ్యాంకు దగ్గరికి వెళ్ళింది.అయితే అక్కడ ఆ మహిళ అద్దాల తలుపును ఢీకొని చనిపోయింది.
ఆ సన్నివేశాలన్నీ బ్యాంకు సీసీటీవీలో పూర్తిగా నమోదయ్యాయి.ఇకపోతే ఈ సంఘటన కేరళలోని ఎర్నాకుళం వద్ద ఉన్న పెరంబూరు చెందిన ఓ మహిళ కు జరిగింది.
ఆ మహిళ తన స్కూటర్ కి తాళం వేయలేదన్న సంగతి గుర్తుకు రావడంతో కంగారుగా బయటికి వెళ్లేందుకు ప్రయత్నం చేసింది.ఇక ఆ తొందరలో ఆమె అద్దాల డోర్ మూసి ఉన్న సంగతి గమనించక పోవడంతో ఆమె తలుపుని ఢీ కొట్టగానే వెంటనే ఆ అద్దాలు పగిలిపోయాయి.
అలా పగిలిపోయిన అద్దాల డోర్ నుండి ఒక పదునైన అద్దం ముక్క ఒకటి ఆమె కడుపు లోకి గుచ్చుకుంది.దింతో ఆ బ్యాంకులోని అధికారులు హుటాహుటిన ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినా ఫలితం కనపడలేదు.
ఆమె చికిత్స పొందుతూ హాస్పిటల్లో మరణించడం జరిగింది.దీనితో ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy