తెలంగాణలో మద్యం ధరలు తగ్గనున్నాయా..?!

తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న రాష్ట్ర సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది.

మద్యం ధరలను తగ్గించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని తెలుస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మద్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ధరలను తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఉన్న ధరలపై సుమారు 15 శాతం తగ్గించేందుకు సమాయత్తం అవుతుందని తెలుస్తోంది.అయితే దీనిపై ఎటువంటి అధికార ప్రకటన రాలేదు.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు