తన కోపమే తన శత్రువు అనే సామెతను చాలామంది వినే ఉంటారు.మనిషికి కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తే ఎలాంటి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉండదు.
అలాకాకుండా కోపంతో తమను తాము కంట్రోల్ చేసుకోలేనంతగా ఎదుటి వారితో వాదనకు దిగితే కుటుంబం రోడ్డున పడుతుంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఓ మహిళ పుట్టినరోజు సందర్భంగా తన భర్త దుబాయ్ కి తీసుకెళ్లలేదని కోపంతో భర్తపై దాడి చేయడంతో.
భర్త క్షణాల్లో ప్రాణాలు విడిచాడు.ఈ ఘటన పూణే( Pune )లో చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు( Police ) తెలిపిన వివరాల ప్రకారం.పూణేలోని వనవ్డి ప్రాంతంలో నిఖిల్ కన్నా (36) అనే వ్యక్తి తన భార్య రేణుకతో కలిసి జీవిస్తున్నాడు.వీరు ఆరేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు.
నిఖిల్( Nikhil ) కన్నా నిర్మాణ రంగ వ్యాపారవేత్తగా పనిచేస్తున్నాడు.

శుక్రవారం రేణుక పుట్టినరోజు.అయితే పుట్టినరోజు సెలబ్రేషన్స్( Birthday Celebrations ) కోసం భర్త నిఖిల్ కన్నా దుబాయ్ కి తీసుకెళ్లలేదు.కనీసం ఖరీదైన గిఫ్ట్ లు కూడా రేణుకకు ఇవ్వలేదు.
ఈ విషయంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ దంపతుల మధ్య మొదలైన చిన్న గొడవ పెను తుఫానుల మారింది.క్షణికావేశంలో రేణుక తన భర్త నిఖిల్ ముఖంపై బలంగా గుద్దడంతో, నిఖిల్ దంతాలు విరిగిపోయాయి.
ముక్కు నుంచి తీవ్రంగా రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే నిఖిల్ ప్రాణాలు విడిచాడు.చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా.ముక్కుపై బలంగా గుద్దడం వల్ల పళ్ళు ఊడిపోయి తీవ్ర రక్తస్రావం కావడం వల్లే నిఖిల్ మరణించాడని నిర్ధారణ అయింది.
రేణుక పై కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.







