IPL 2023లో శనివారం గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్( Gujarat Titans, Kolkata Knight Riders ) మధ్య మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో జీటీపై విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో చాలా మంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసినా.కేకేఆర్కు చెందిన రింకూ సింగ్( Rinku Singh ) మాత్రం ఈ మ్యాచ్లో హీరోగా అవతరించాడు.
మ్యాచ్ చివరి ఐదు బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి KKRను అద్భుతంగా గెలిపించాడు.కాగా రింకూ సింగ్ తోపాటు అతని కుటుంబంలో ఎవరు ఉన్నారు? రింకూ కష్టపడి ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రింకూ సింగ్ పూర్వాపరాలివే.ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ఆడుతున్న రింకూ సింగ్ 1997 అక్టోబర్ 12న ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జన్మించాడు.ఐదుగురు తోబుట్టువులలో మూడవది వాడయిన రింకూ చాలా సాధారణ కుటుంబం నుండి వచ్చాడు.అతను తన జీవితంలో కష్ట సమయాలను చూశాడు.సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నిలకడగా రాణించడంతోఐపీఎల్లో కేకేఆర్కు( KKR ) ఆడే అవకాశం లభించింది.రింకూ తండ్రి ఎల్పీజీ సిలిండర్లను ఇళ్లకు పంపిణీ చేసేవాడు.
సాధారణ జీవనశైలిని గడుపుతున్న రింకూ సింగ్కు అతని కుటుంబంలో తల్లిదండ్రులు, ఒక సోదరుడు, సోదరి ఉన్నారు.సమాచారం ప్రకారం, రింకు సింగ్ తండ్రి పేరు ఖాన్చంద్ర సింగ్( Khanchandra Singh ), అతను ఎల్పిజి సిలిండర్లను ఇళ్లకు పంపిణీ చేసేవాడు.ఇతని తల్లి పేరు వీణాదేవి గృహిణి.రింకూ సోదరుడి పేరు జీతూ సింగ్ ఆటో నడుపుతుంటాడు.అతని సోదరి పేరు నేహా సింగ్.రింకూ సింగ్ క్రికెట్ అరంగేట్రం ఇలా.16 సంవత్సరాల వయస్సులో రింకు సింగ్ 5 మార్చి 2014న UP తరపున లిస్ట్ A క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.
అతను తన మొదటి మ్యాచ్లో 87 బంతుల్లో 83 పరుగులు చేశాడు.దీని తర్వాత, 31 మార్చి 2014న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన T20 అరంగేట్రం చేసి, అతను విదర్భపై 5 బంతుల్లో అజేయంగా 24 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు.రింకూ సింగ్ను 2018లో రూ.80 లక్షలకు KKR కొనుగోలు చేసింది.మొదటి సీజన్లో రింకూ సింగ్ ఆటతీరు బాగా లేకపోయినప్పటికీ, KKR అతని సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకొని IPL 2019కి కూడా అతనిని కొనసాగించింది.
ఐపీఎల్లో రింకూ సింగ్ ఇప్పటి వరకు 20 మ్యాచ్లు ఆడి, 349 పరుగులు చేశాడు.ఈ ఏడాది రూ.55 లక్షలకు రింకూను కేకేఆర్ జట్టులో కొనసాగిస్తోంది.