అదొక ఇల్లు.ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా 50 అడుగుల లోతుకు పడిపోయింది ఆ ఇల్లంతా.
చూసేందుకు బావిలా మారిపోయింది.ఏమైందో గమనించేలోపే అంతా జరిగిపోయింది.
పక్కనే ఉన్న స్థానికులంతా అలాగే చూస్తుండిపోయారు.అదృష్టవశాత్తు ఎవరికీ ఎలంటి ప్రమాదం జరగలేదు.
అయితే అసలు ఆ ఇళ్లు భూమిలోకి ఎలా పోయింది, ఈ ఘటన ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది.
అంతా చూస్తుండగానే ఉన్న చోటు నుంచే ఓ ఇళ్ల 50 అఢుగుల లోతుకు జారిపోయింది.చంద్రాపూర్ జిల్లాలోని ఘుఘ్గస్ పట్టణంలో ఈ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది.బ్రిటీష్ కాలంలో అక్కడ భూగర్భ బొగ్గు గని ఉండేదని.1985లో దాన్ని ఉపరితల బొగ్గు గనిగా మార్చాలని స్థానికులు చెబుతున్నారు.ఘుఘ్గస్ పట్టణం బొగ్గు గనిపైనే ఉందని.పక్కనే ఉన్న వర్ధానది ఉప్పొంగడం వల్లే ఇలా జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.ఈ ఘటనపై నిపుణుల బృందం విచారణ జరుపుతుంది.అప్రమత్తమైన అధికారులు సమీపంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు.
ఇదేంటి అక్కడేమైనా భూకంపం వచ్చిందా అని కొందరు, ఆ ఒక్క ఇళ్ల మాత్రమే ఇలా భూమిలోకి ఎలా జారిపోతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.అయితే నిపుణుల బృందం పూర్తి వివరాలు వెల్లడించే వరకు అసలు ఆ ఇల్లు ఎందుకలా కుంగిపోయిందో, సమస్య ఏంటో తెలియదు.
ఇందుకు సంబంధించిన ఏ విషయం తెలియాలన్నా ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.