ఏపీకి, పవన్ కు సంబంధమేంటి?: మంత్రి అమర్నాథ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.నిన్న జనసేనాని పవన్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు.

సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ ఏకవచనంతో మాట్లాడారని మంత్రి గుడివాడ మండిపడ్డారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ఆగిపోయిందని ఏ కేంద్రమంత్రి చెప్పారని ప్రశ్నించారు.

అలాగే పవన్ కల్యాణ్ స్థిర నివాసం తెలంగాణలో ఉందన్న ఆయన ఏపీకి, పవన్ కు మధ్య సంబంధం ఏంటని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే ఏపీలో పవన్ ది ఏ నియోజకవర్గమో చెప్పమనండని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు డిపాజిట్లు కూడా రాలేదన్నారు.తెలంగాణలో బీజేపీని పవన్ నాశనం చేశారని విమర్శించారు.

Advertisement

కేవలం పొలిటికల్ కాంట్రాక్టుల కోసం పుట్టిన పార్టీ జనసేన అని దుయ్యబట్టారు.

జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?
Advertisement

తాజా వార్తలు