ఒడిశా: వలకు చిక్కిన 40 కిలోల అరుదైన భారీ చేప.. దాని విశేషాలు ఏంటంటే..??

ఇండియాలో( India ) అనేక ప్రాంతాల్లో అరుదైన చేపలు మత్స్యకారుల వలలో పడుతుంటాయి.ఇవి భారీ సైజులో ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

మత్స్యకారుల పంట పండిస్తున్నాయి ఈ అరుదైనవి చాలా ధర పలుకుతాయి.పైగా భారీ ధరలో ఉండటం వల్ల మంచి రేట్ వస్తుంది.

ఒడిశాలోని బౌద్ జిల్లాలో ఒక అరుదైన భారీ చేప పట్టుబడినట్లు సోమవారం వార్తలు వచ్చాయి.ఈ చేప 40 కిలోల బరువు ఉంటుందని, బౌద్ గుండా ప్రవహించే నదిలో పట్టుకున్నారని తెలుస్తోంది.

ఈ చేప సత్కోసియా( Satkosia ) నుండి వలస వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.

Advertisement

వర్షాకాలంలో, బురద నీరు నదిలోకి వచ్చినప్పుడు ఈ రకమైన రేర్ ఫిష్ ( Rare fish )వలలో పడతాయని మత్స్యకారులు చెబుతున్నారు.ఈ ప్రాంత మత్స్యకారులు ఈ అరుదైన చేప జాతిని గతంలో చాలాసార్లు పట్టుకున్నారని తెలిపారు.దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో ఒక మత్స్యకారుడు చేపను నేల మీద ఉంచే వీడియోకి చూపించడం మనం చూడవచ్చు.ఒక యువతి ఇది చాలా పెద్ద చేప అంటూ ఆశ్చర్య పోవడం కూడా మనం గమనించవచ్చు.

ఈ లింకు https://youtu.be/dI_9DICKj4w?si=rB8Aks9SHQSAE9HHపై క్లిక్ చేసి ఆ వీడియో చూడవచ్చు.

ఈ చేప జాతి ఏంటి, పొడవు ఎంత ఈ చేపకు ఏదైనా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయా? వివరాలు ఇంకా ఏవీ తెలియ రాలేదు.ఈ వివరాలను బట్టి చేప ధర అనేది జరగవచ్చు.ఈ భారీ చేపలు వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి.

పల్లవి ప్రశాంత్ దెబ్బకు బిగ్ బాస్ మారిపోయాడా.. ఈ సీజన్ లో సామాన్యులకే ప్రాధాన్యత!
వైరల్ వీడియో : మెట్రోలో " నాటు.. నాటు.. " రెచ్చిపోయిన యువకుడు..

ఎందుకంటే వర్షాల కారణంగా నదుల్లో బురద నీరు వస్తుంది, ఈ రకమైన చేపలు ఆ నీటిలోకి వలస వస్తాయి.సాధారణంగా, ఈ చేపలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.

Advertisement

ఈ చేపలు బురద నీటిని ఇష్టపడతాయి, ఎందుకంటే అది వాటికి ఆహారం అందిస్తుంది.బురద దాక్కోవడానికి సురక్షితమైన ప్రదేశాలను ఆఫర్ చేస్తుంది.

తాజా వార్తలు