అనకాపల్లి జిల్లా మునగపాక మండలం చంద్రబాబు కాలనీలో విల్లూరి నూక నర్సింగరావు వారి కుమారుడు హరీష్, తేజ శుభలేఖను వినూత్న రూపంలో అచ్చు వేయించారు.తెల్ల కాగితాల పుస్తకం అట్ట పై శుభలేఖలు అచ్చు వేయించారు.
మా నాన్నగారు ఆలోచనల మేరకు శుభలేఖను పుస్తకం రూపంలో బంధువులకు, ఫ్రెండ్స్ కు, కుటుంబ సభ్యులకు జ్ఞాపకం ఉండే విధంగా సుమారుగా 800 పుస్తకాలు అచ్చు వేయించారు.
అదే విధంగా ఈ కార్డులో అడ్రస్ కొరకు బార్ కోడ్ స్కాన్ చేస్తే పెళ్లి మండపం మనకు చేరే విధంగా ఏర్పాటు చేశాము.
మా నాన్నగారు ఆలోచనకు నాకు చాలా గర్వంగా ఉంది.ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు.