ఎన్నో ఏళ్లుగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నాం: ఎంపీ మాగుంట

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై ఒంగోలు ఎంపీ మాగుంట స్పందించారు.తన తండ్రి హయాం నుంచి లిక్కర్ వ్యాపారం చేస్తున్నట్టు చెప్పారు.

ఎన్నో ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నట్లు పేర్కొన్నారు.ఢిల్లీలోని 32 జోన్లలో రెండు జోన్లలో తమ బంధువులకు సంబంధించిన షాపులు ఉన్నాయని తెలిపారు.

ఇటీవల నిర్వహించిన ఈడీ సోదాల్లో ఎలాంటి డాక్యుమెంట్లు లభించలేదని చెప్పారు.అదేవిధంగా వ్యాపారాలను రాజకీయాలకు ముడి పెట్టద్దని సూచించారు.

తమ రాజకీయ జీవితానికి ఎలాంటి అడ్డంకులు లేవన్న ఆయన.రానున్న ఎన్నికల్లో తన కుమారుడు ప్రకాశం జిల్లా నుంచి పోటీలో దిగుతారని స్పష్టం చేశారు.

Advertisement
ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. : అమిత్ షా

తాజా వార్తలు