మనుషుల్లో వింత రకాల వారు వుంటారు.ముఖ్యంగా కొంతమంది పోకిరీల వలన ఎదుటివారు సమస్యల్లో ఇరుక్కుంటూ వుంటారు.
వారు అక్కడా ఇక్కడాని కాదు, ఎక్కడైనా వుంటారు.ఇటీవలి కాలంలో చూసుకుంటే విమాన ప్రమాదాలు అనేవి కొంతమంది అతి చేష్టల కారణంగానే జరుగుతున్నాయని ఓ సర్వేలో తేలింది.
అవును, వారి ఓవర్ యాక్షన్ తో ఇతర ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, ఎమర్జెన్సీ డోర్ను ఓపెన్ చేయడం వంటి పనులు చేస్తున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే ఇండిగో విమానంలో చోటు చేసుకోవడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే, నాగపూర్ నుంచి ముంబై వెళ్తున్న 6E-5274 ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు నానా హంగామా సృష్టించాడు.అతగాడి పేరు ప్రణవ్ రౌత్.ఇండిగో విమానం ప్రయాణంలో ఉన్న సమయంలోనే అతగాడు చాలా దారుణంగా ప్రవర్తించాడు.ఫ్లైట్ కి ఉన్న ఎమర్జెన్సీ డోర్ ని తెరిచే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో అతడిని చూసిన విమాన సిబ్బంది వెంటనే అలర్ట్ కావడం వలన పెను ప్రమాదం తప్పింది.
అవును, సదరు ప్రయాణికుడి అనుచిత చర్య కారణంగా విమానంలో ఉన్న మిగతా ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.అనంతరం, సిబ్బంది ఈ విషయాన్ని పైలట్ దృష్టికి తీసుకువెళ్లారు.ఇక దాంతో విమానం విమానాశ్రయంలో సదరు విమానం ల్యాండ్ అయిన తర్వాత… ప్రణవ్ రౌత్ను CISF బలగాలకు అప్పగించారు.
అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.విమానంలో అతిగా ప్రవర్తించినందుకు ప్రణవ్ రౌత్ పైన కేసు నమోదు చేసారు.అయితే ఇది మొదటిసారి కాదు, ఇలాంటివి ఈమధ్య కాలంలో వరుసగా జరుగుతున్నాయి.