నేటి సమాజంలో వివాహాల రూపురేఖలే మారిపోయాయి.ఒకరిని చూసి ఒకరు ఇపుడు తమ వివాహాలను చాలా హాట్టహాసంగా జరుపుకుంటున్నారు.
దానికోసం కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ వుంటారు వధూవరులు.పెళ్ళి కార్డుల నుంచి ఊరేగింపు వరకు ఇలా అన్నీ చాలా వెరైటీగా ప్లాన్ చేస్తూ వుంటారు.
ఇక పెళ్లి తంతు ముగిసాక జనాలు కనీసం నెలరోజులు వారి పెళ్లి గురించి మాట్లాడేలా కోరుకుంటారు.అలా ప్లాన్ చేసుకుంటారు.
ఇక దాని కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడడం లేదు ఇప్పటి తరం.అవసరమైతే అప్పు చేసైనా ఎవరికి నచ్చినట్టు వారు వివాహం చేసుకుంటున్నారు నేడు.
ముఖ్యంగా వివాహ సమయంలో మండపానికి ఎవరీ స్టైల్లో వారు ఎంట్రీ ఇస్తున్నారు మహానుభావులు.పెద్ద పెద్ద ఓపెన్ టాప్ కార్లలో ఒకరు ఊరేగింపుగా మండపానికి వస్తే, కొందరు గుర్రాలపైన, మరి కొందరు అలంకరించిన పల్లకీలపైన, కొందరు ట్రాక్టర్ల పైన హీరో, హీరోయిన్ మాదిరి వస్తూ వుంటారు.దానికి బాక్గ్రౌండ్ కూడా రకరకాల సౌండ్స్ ఉండాల్సిందే.ఈ క్రమంలోనే తాజాగా ఓ పెళ్లి కొడుకు ఎంట్రీ అందరినీ ఆశ్చర్యపరిచింది.అవును, మామ్మూలుగా వస్తే కిక్కేముంటుంది అని అనుకున్నారేమో గాని, గుజరాత్లోని నవ్సారి జిల్లా కలియారి గ్రామానికి చెందిన కేయూర్ పటేల్ తన పెళ్ళి కోసం ఏకంగా జేసీబీని సిద్ధం చేశాడు.
జేసీబీ ముందుభాగంలో ఉండే వోబాక్స్ను అలకరించి దానిలో తన బంధువులతోపాటు వోబాక్స్లో అమర్చిన సోఫాపై దర్జాగా కూర్చొని ఫంక్షన్హాల్కు వచ్చాడు.ఇక జేసీబీ ఎనుక అతని బంధుగనమంతా ఇతర వాహనాల్లో ఊరేగింపుగా వచ్చారు.మధ్యమధ్యలో వాహనాన్ని ఆపి DJ డ్యాన్స్ లు చేసుకుంటూ ఉత్సాహంగా మండపానికి చేరుకున్నారు.
అలా జేసీబీపై నుంచి పెళ్లిమండపానికి రావడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దానిని చూసిన నెటిజన్లు పిచ్చి పీక్స్ కు వెళ్లిందని కామెంట్లు పెట్టడం కొసమెరుపు.
మరి కొంతమంది వైవిధ్యం ఎక్కువైందంటూ కామెంట్స్ చేస్తున్నారు.