టీడీపీ కీలక నేతల పై విజయసాయిరెడ్డి విమర్శలు..!!

వైసీపీ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ కీలక నాయకుల పై విమర్శల వర్షం కురిపించారు.

చంద్రబాబు నారా లోకేష్ ని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విజయసాయిరెడ్డి ఏమన్నారంటే తండ్రీకొడుకులు ఇంత త్వరగా చేతులెత్తేస్తారని అనుకోలేదు.పచ్చ పార్టీ భవిష్యత్తును ఎల్లో మీడియాకు అప్పగించారు.

ఇంకో రకంగా చెప్పాలంటే GPA రాసిచ్చారు.వాళ్ల కథలకు మురిసిపోతూ ప్రజాక్షేత్రాన్ని పూర్తిగా మర్చిపోయారు.40 ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయ ముగింపు ఇలా సాగుతోంది.సిగ్గూశరం లేని టీడీపీ నేతలు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చావేదికలు పెడుతున్నారు.

విశాఖ పాలనా రాజధానవుతుందంటే ఓర్వలేరు.పెట్టుబడులు వస్తుంటే తట్టుకోలేరు.

Advertisement

పైగా ముఖ్య అతిథులుగా అశోక్, అచ్చెన్న.విజయనగరం, శ్రీకాకుళంను రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాలుగా మార్చిన ఘనులు వీరు అంటూ విజయ్ సాయి రెడ్డి టీడీపీ కీలక నేతలపై మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..!!

Advertisement

తాజా వార్తలు