శ్రీదేవి.. మిథున్ చక్రవర్తి పెళ్లి వెనక అన్నపూర్ణ స్టూడియో లో ఏం జరిగింది ?

అప్పట్లో హీరోల క్రేజ్ కేవలం ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యేది.టాలీవుడ్ హీరోలకు టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ లో క్రేజ్ ఉండేది.

కానీ హీరోలకు మించిన రేంజ్లో అన్నీ ఇండస్ట్రీలలో కూడా స్టార్ హీరోయిన్గా ఏకంగా కొన్నాళ్లపాటు హవా నడిపించింది శ్రీదేవి.ఇక భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా ప్రేక్షకుల మదిలో గుడి కట్టుకుంది అని చెప్పాలి.

తిరుపతి మూలాలు ఉన్న శ్రీదేవి తమిళ్ లో ముందుగా హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.అలా ఆ తర్వాత టాలీవుడ్ లో అటు వెంటనే బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ గా తక్కువ సమయంలోనే అయ్యింది శ్రీదేవి.

తన అందంతో నటనతో డాన్సులతో తనకు తిరుగులేదని నిరూపించుకుంది.వీటితో పాటు బాలీవుడ్లో కూడా స్టార్ హీరోలందరితో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది శ్రీదేవి.

Advertisement

నిర్మాత బోనీ కపూర్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.అయితే అతనికి పెళ్లయి పిల్లలు ఉన్నాసరే పట్టు పట్టి మరీ మరి బోని కపూర్ ను పెళ్లి చేసుకుంది అతిలోక సుందరి శ్రీదేవి.

ఇక అప్పట్లో ఇది ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది అనే విషయం తెలిసిందే.అయితే అంతకుముందు శ్రీదేవి మిథున్ చక్రవర్తి తో వివాహం జరుగుతుంది అని అందరూ అనుకున్నారు.

ఎందుకంటే ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు.వీరి కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి.

మిధున్ చక్రవర్తిని వదిలి ఉండలేనంత మైకంలో ఉండిపోయింది శ్రీదేవి.కానీ వీరి పెళ్లి క్యాన్సిల్ అయింది.ఇంతకీ పెళ్లి కాన్సర్ కావడానికి కారణాలు తెలిస్తే మాత్రం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తెలుగులో ఖైదీ రుద్రయ్య గా వచ్చిన ఈ సినిమాను బాలీవుడ్ లో సార్ వర్త్ కి ఆవాజ్ పేరుతో రీమేక్ చేశారు.తెలుగువారైన విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ అధినేత త్రివిక్రమరావు నిర్మాత.

Advertisement

దీనికి సంబంధించి షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న సమయంలో స్వయంగా మిధున్ చక్రవర్తిని తమ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగిందట శ్రీ దేవి తల్లి.

కానీ అదే సమయంలో శ్రీదేవి తల్లి ఒక కండీషన్ కూడా పెట్టారటా.నువ్వు మొదటి భార్యకు విడాకులు ఇవ్వాలని అంటూ కండిషన్ పెట్టారట.కానీ అందుకు మిథున్ చక్రవర్తి ఒప్పుకోలేదు.

తను యోగితా బాలిని పెళ్లి చేసుకున్న తర్వాత తనకు అదృష్టం కలిసి వచ్చిందని.చెప్పాడట.

ఇక మొదటిభార్యకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.శ్రీదేవిని రెండో భార్య గా పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పాడట మిథున్ చక్రవర్తి.

మొదటి భార్యకు విడాకులు ఇవ్వను అని చెప్పడంతో ఇక శ్రీదేవి తల్లి వీరి పెళ్లికి ఒప్పుకోలేదట.చివరికి పెళ్లి క్యాన్సిల్ అయింది.

తాజా వార్తలు