మనసంతా నువ్వే మూవీ హీరోయిన్ కు ఏకంగా ఇంత పెద్ద కొడుకా.. అస్సలు నమ్మలేముగా!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావాలి ఇప్పటివరకు ఎన్నో లవ్ సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే.

అందులో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ సినిమా అంటే ముందుగా మనసంతా నువ్వే సినిమా( Manasantha Nuvve )నే వినిపిస్తూ ఉంటుంది.

ఇప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా చూడడంతో పాటు టీవీలలో వస్తే అతుక్కుని పోయి చూసే వారు చాలామంది ఉన్నారు.వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 2001లో విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్‏లో దూసుకుపోతున్నాయి.

ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ అప్పట్లో యూత్‏ను ఆకట్టుకుంది.ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరోహీరోయిన్లుగా నటించగా.తనికెళ్ల భరణి, సునీల్, తనూరాయ్, చంద్రమోహన్ వంటి వారు కీలకపాత్రలలో నటించారు.

మనసంతా నువ్వే సినిమాతో అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ రీమా సేన్.ఈ సినిమా తర్వాత తెలుగుతో పాటు తమిళంలో కొన్ని సినిమాల్లో నటించిన రీమా సేన్.

Advertisement

ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.

కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో మాత్రం ఆఫర్స్ రాలేదు.దీంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.

ఆ తరువాత 2012లో వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ ( Shiv Karan Singh)ను వివాహం చేసుకున్నారు.వీరికి 2013 ఫిబ్రవరి 22న రుద్రవీర్( Rudraveer ) అనే బాబు జన్మించాడు.పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన రీమా సేన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు.

చాలా కాలంగా సినిమా ఈవెంట్లకు, పార్టీలకు దూరంగా ఉంటుంది రీమా సేన్.కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.తాజాగా రీమా సేన్ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మొటిమలు మచ్చలు పోయి ముఖం అందంగా మారాలా.. అయితే ఈ సీరం మీకోసమే!
ఆ సమయంలో నాన్న బాగా ఏడ్చారు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన సితార!

ముఖ్యంగా రీమా సేన్ కొడుకు ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు.ఆమెకు ఏకంగా అంత పెద్ద కొడుకు ఉన్నాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.

Advertisement

ఇంత చిన్నకే అంత పెద్ద కొడుకా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు