తెలంగాణలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి.ఏ పట్టణంలో చూడు నిత్యం ప్రమాదాల బారిన పడి ఎందరో మరణిస్తున్నారు.
వీరినే నమ్ముకున్న వారికి కడుపుకోత మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు.
ఇక రోజుకు పదుల సంఖ్యలో వాహన ప్రమాదాలు జరుగుతున్న వాటిని నడిపే వారిలో మార్పు మాత్రం కనిపించడం లేదు.
ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది కావచ్చూ.కానీ మన దృష్టికి మాత్రం ఇంత కంటే తక్కువ రావడం లేదు.
ఇకపోతే తాజాగా మంచిర్యాల పట్టణంలో ఏసిసి లోని హోమ్ శిల్డ్ ఎదురుగా లారీ బైక్ ఆక్సిడెంట్ కాగా, ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న డీసిపి ఉదయ్ కుమార్, టౌన్ సిఐ ముత్త లింగయ్య, ట్రాఫిక్ ఎస్.ఐ వినోద్, ఎ.ఎస్.ఐ శ్రీనివాస్, లు మృతదేహాలని ప్రభుత్వాస్పత్రికి తరలించారట.సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీస్లు దర్యాప్తు అనంతరం పూర్తి సమాచారం వెల్లడిస్తామని వివరించారు.