మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్‌లోనే ఇద్దరు మృతి.. !

తెలంగాణలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి.ఏ పట్టణంలో చూడు నిత్యం ప్రమాదాల బారిన పడి ఎందరో మరణిస్తున్నారు.

 Mancherial, Acc, Road Accident, Two Persons Death-TeluguStop.com

వీరినే నమ్ముకున్న వారికి కడుపుకోత మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు.

ఇక రోజుకు పదుల సంఖ్యలో వాహన ప్రమాదాలు జరుగుతున్న వాటిని నడిపే వారిలో మార్పు మాత్రం కనిపించడం లేదు.

ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది కావచ్చూ.కానీ మన దృష్టికి మాత్రం ఇంత కంటే తక్కువ రావడం లేదు.

ఇకపోతే తాజాగా మంచిర్యాల పట్టణంలో ఏసిసి లోని హోమ్ శిల్డ్ ఎదురుగా లారీ బైక్ ఆక్సిడెంట్ కాగా, ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న డీసిపి ఉదయ్ కుమార్, టౌన్ సిఐ ముత్త లింగయ్య, ట్రాఫిక్ ఎస్.ఐ వినోద్, ఎ.ఎస్.ఐ శ్రీనివాస్, లు మృతదేహాలని ప్రభుత్వాస్పత్రికి తరలించారట.సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీస్‌లు దర్యాప్తు అనంతరం పూర్తి సమాచారం వెల్లడిస్తామని వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube