హనుమంతుడికి 108 వెండి తమలపాకులతో పూజిస్తే..!

సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఉంటాయి.

వ్యాపారంలో ఒడిదుడుకులు, ఉద్యోగంలో ఇబ్బందులు, పెళ్లి విషయంలో ఇబ్బందులు తలెత్తడం వంటివి ఎంతో మందిని ఎన్నో రకాలుగా బాధ పెడుతుంటాయి.

ఈ విధంగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ముందుగా హనుమంతున్ని పూజిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.ఏడు మంగళవారాలు తప్పకుండా హనుమంతుని ఆలయాన్ని దర్శించి 108 ప్రదక్షిణలు చేసి మన మనసులోని కోరికను స్వామి వారి సన్నిధిలో తెలుపుట వల్ల తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

భక్తి శ్రద్దలతో స్వామివారిని పూజించడం వల్ల మన జీవితంలో ఏర్పడినటువంటి అంగారక, రాహు, శని వంటి ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి.అయితే ప్రతి మంగళ శుక్ర శని వారాలలో ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల మధ్య స్వామివారికి వెండి తమలపాకులతో పూజలు చేయటం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

అలాగే సువర్చలా హనుమ కల్యాణం జరిపిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి.

Advertisement

ప్రతినెలా పూర్వభద్ర నక్షత్రం రోజున స్వామివారికి సువర్చలా హనుమ కల్యాణం జరిపించవచ్చు.ఎంతో ధైర్యశాలి అయిన హనుమంతుడిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.కనుక భక్తులు కోరిన వెంటనే కోరికలను తీర్చే దయాగుణుడు ఆంజనేయుడు అని చెప్పవచ్చు.

అయితే ఆంజనేయ స్వామికి ప్రతి మంగళ, శుక్ర ,శని వారాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, సుఖ సంతోషాలతో గడుపుతారు.అయితే స్వామివారికి పూజ చేసే సమయంలో ఎర్రటి వస్త్రాలు ధరించి, పూజ సమయంలో స్వామి వారికి ఎర్రటి పుష్పాలను సమర్పిస్తే స్వామివారి అనుగ్రహం మనపై కలిగి మనకు ఎంతో ధైర్యాన్ని ప్రసాదిస్తాడు.

అదేవిధంగా మన జీవితంలో ఏర్పడ్డ కష్టాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా స్వామివారికి 108 వెండి తమలపాకులతో పూజించడం మర్చిపోకూడదు.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు