మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.ఇక మన తెలుగులో రాజమౌళి తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకుని స్టార్ డైరెక్టర్ గా వెలుగొందు తున్నాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెబితేనే ఆ సినిమా సూపర్ హిట్ అని ముందుగానే చెప్పేస్తారు.అంతలా ఈయన తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు.
త్రివిక్రమ్ గత సినిమా అల వైకుంఠపురములో సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ సాధించాయి.ఈ సినిమా తర్వాత ఈయన మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు.
అయితే మహేష్ బాబుతో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమా రెగ్యురల్ షూట్ స్టార్ట్ అయ్యింది.
మరి ఈయన నెక్స్ట్ సినిమా ఎవరితో అనే విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ఈ సినిమా పూర్తి అవగానే త్రివిక్రమ్ ఎవరితో చెయ్యాలో అనే లిష్టు చాలా పెద్దగానే కనిపిస్తుంది.
ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ లైనప్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.ఈయన చెప్పిన ప్రకారం చుస్తే ఈయన లైనప్ భారీగానే ఉన్నట్టు తెలుస్తుంది.
త్రివిక్రమ్ లిష్టులో ముఖ్యంగా ప్రభాస్ పేరు కూడా వినిపిస్తుంది.సాహో తర్వాత నుండి త్రివిక్రమ్ ప్రభాస్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.
కానీ వర్కౌట్ అవ్వడం లేదు.
ఇక ఈయన లిష్టులో వెంకటేష్ కూడా ఉన్నారు.త్రివిక్రమ్, వెంకటేష్ కాంబోలో సినిమా రాబోతుంది అని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి సెట్ అవుతుందో చూడాలి.
ఆ తర్వాత లిష్టులో అల్లు అర్జున్, రామ్ చరణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి పేర్లు కూడా ఉన్నాయి.ఇంతమందితో సినిమాలు చేయాలని త్రివిక్రమ్ ఆసక్తితో ఉన్నారట.
చూడాలి మరి వీరిలో ఒక్కరితో అయినా సినిమా సెట్ అవుతుందో లేదో.