తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అయింది.ఈనెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనుండగా రేపు అంకురార్పణ జరగనుంది.

 Tomorrow Is The Seed Offering For The Tirumala Srivari Brahmotsavam-TeluguStop.com

ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.ఈ క్రమంలోనే ఎల్లుండి ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

సోమవారం నాడు సీఎం జగన్ స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.బ్రహ్మోత్సవాలలో భాగంగా తొమ్మిది రోజులపాటు స్వామివారు వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అందుకు తగినట్లుగా టీటీడీ ఏర్పాట్లను చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube