తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అయింది.ఈనెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనుండగా రేపు అంకురార్పణ జరగనుంది.
ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.ఈ క్రమంలోనే ఎల్లుండి ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.
సోమవారం నాడు సీఎం జగన్ స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.బ్రహ్మోత్సవాలలో భాగంగా తొమ్మిది రోజులపాటు స్వామివారు వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అందుకు తగినట్లుగా టీటీడీ ఏర్పాట్లను చేస్తోంది.