రాంచరణ్ కి కూడా యాభై శాతం వాటా ఉంది... నిర్మాత అభిషేక్ కామెంట్స్ వైరల్!

రవితేజ ( Raviteja ) హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా (Tiger Nageswararao) దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhisekh Aggarwal ) సైతం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నిర్మాత అభిషేక్ అగర్వాల్ రామ్ చరణ్ ( Ramcharan )గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.రామ్ చరణ్, తన స్నేహితుడు విక్రమ్ కలిసి V మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ని స్థాపించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ బ్యానర్, అభిషేక్ అగర్వాల్ బ్యానర్ తో కలిసి ఒక పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) హీరోగా తెరకెక్కబోయే ది ఇండియా హౌస్ ( The India House ) అనే ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ కూడా భాగమయ్యారు ఇదే విషయాన్ని తాజాగా అభిషేక్ అగర్వాల్ తెలియచేశారు.నిర్మాత రామ్ చరణ్ కి కూడా ఈ సినిమా కథ ఒకసారి వినమని చెప్పారట అయితే ఈ సినిమా కథ వివరిస్తున్నటువంటి సమయంలో రామ్ చరణ్ ఈ సినిమా పట్ల చాలా ఆసక్తి కనపరచడమే కాకుండా ఈ సినిమాపై చాలా నమ్మకం ఏర్పడటంతో ఏకంగా ఆయన కూడా ఈ సినిమా నిర్మాణంలో 50 శాతం పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని తెలిపారు.

ఈ విధంగా నిఖిల్ నటించబోయే ఈ సినిమా రామ్ చరణ్ కు విపరీతంగా నచ్చినటువంటి సందర్భంలోనే ఆయన 50 శాతం పెట్టుబడులు పెట్టారని ఆయనకి ఈ సినిమాలో 50% వాటా ఉంది అంటూ అభిషేక్ వెల్లడించారు.ఈ సినిమా స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ బయోపిక్ గా రాబోతోందా అనే సందేహాలు నేపథ్యంలో ఈ విషయంపై కూడా నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమా వీర్ సావర్కర్ కి సంబంధించిన కథ మాత్రమే కానీ ఆయన బయోపిక్ కాదు అంటూ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇలా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా భాగమయ్యారు అనే విషయం తెలియడంతో సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి.

Advertisement
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

తాజా వార్తలు