సాధారణంగా కొందరు పిల్లలు ఎప్పుడూ నీరసంగా, మూడీగా ఉంటుంటారు.ఇలాంటి పిల్లలు చదువులపైనే కాదు ఆటలపైనా పెద్దగా ఇంట్రస్ట్ చూపలేకపోతుంటారు.
దీంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలీక.పిల్లలను తరచూ హాస్పటల్స్ చుట్టూ తిప్పుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ను పిల్లలకు ఇస్తే.వారు సూపర్ యాక్టివ్గా మారతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? మరియు ఏ సమయంలో పిల్లలకు ఇవ్వాలి.? వంటి విషయాలను తెలుసుకుందాం పదండీ.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు పొట్టు తీసిన బాదం పప్పులు, ఆరు జీడి పప్పులు, వన్ టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో అర స్పూన్ సబ్జా గింజలు వేసి కప్పు వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ పాలు, అర గ్లాస్ నీళ్లు పోయాలి.
పాలు కాస్త హీట్ అవ్వగానే అందులో ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న పొడి, అర స్పూన్ యాలకుల పొడి, రెండు స్పూన్ల బెల్లం పొడి వేసి మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.
చివరిగా ఇందులో నానబెట్టుకున్న సబ్జా గింజలు కలపాలి.అంతే ఈ సూపర్ డ్రింక్ను బ్రేక్ఫాస్ట్ సమయంలో పిల్లల చేత ఒక గ్లాస్ చప్పున తాగించాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే పిల్లలకు బోలెడన్ని పోషకాలు అందుతాయి.తద్వారా వారిలో నీరసం, అలసట వంటివి తొలగిపోయి యాక్టివ్గా, ఎనర్జిటిక్గా మారతారు.మరియు ఈ డ్రింక్ను తాగించడం వల్ల పిల్లల మానసిక మరియు శారీరక ఎదుగుదల కూడా సూపర్గా పెరుగుతుంది.