వైశాఖ మాసంలో పాటించాల్సిన.. ముఖ్యమైన పరిహారాలు ఇవే..!

హిందువు మతంలో( Hinduism ) దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

పాపాలు పోగొట్టుకోవాలంటే వైశాఖ మాసంలో నువ్వులు, మామిడి, సత్తు, వస్త్రాలు( Sesame, Mango, Sattu, clothes ) దానం చేయాలి.

వీటిని దానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి అని పండితులు చెబుతున్నారు.వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండితో చేసిన ఏదైనా వస్తువులను కొనాలి.

ఈ పవిత్రమైన రోజున బంగారం లేదా వెండిని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే దేవతలు కూడా సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు. వైశాఖ మాసంలో( Vaisakha ) వేడి ఎక్కువగా ఉంటుంది.అందుకే పేదలకు చెప్పులు, గొడుగులు దానం చేయాలి.

Advertisement

అలాగే జంతువులు, పక్షులకు ఆహారం, నీరు పెట్టాలి.ఈ పరిహారం జీవితంలో ఆనందాన్ని తెస్తుంది.

ఈ మాసంలో కంచు పాత్రలలో భోజనం చేయడం వల్ల సకల రోగాలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే వైశాఖ మాసంలో బెల్లం దానం చేయడం ద్వారా పితృ దోషం నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్య వరం కూడా లభిస్తుంది.

వైశాఖ మాసంలో వచ్చే సోమవారం రోజు శివునికి రుద్రాభిషేకం చేసి ఆయనకు ఇష్టమైన వస్తువులను సమర్పించాలి.ఇలా చేయడం వల్ల మనిషి ఐశ్వర్యాన్ని పొందుతాడు.అలాగే కోరికలన్నీ నెరవేరుతాయి.

ముఖ్యంగా చెప్పాలంటే పురాణ గ్రంథాలలో వైశాఖమాసం అన్ని ఇతర మాసాలలోకెల్లా పవిత్రమైన మాసంగా భావిస్తారు.ఈ మాసంలో విష్ణు అవతారలైన పరశురాముడు, వరాహ, కుర్మా అవతరణ లను పూజిస్తారు.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
హీరో వినోద్ కుమార్ ఇద్దరు కొడుకులు కూడా హీరోలని మీకు తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు 11 సార్లు ఓం మాధవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి.

Advertisement

తాజా వార్తలు