ఈ ఆలయం నీడ ఎంత వెతికినా కనిపించదు.. దీని రహస్యం ఏంటో తెలుసా..?

తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు కొదువే ఉండదు.ఎన్నో వేల ఏళ్లనాటి అత్యంత పురాతనమైన ఆలయాలు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి.

ఇక వీటిలో ఇప్పటికీ ఎవరు కనిపెట్టని రహస్యాలతో కూడిన కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి.వాటిలో బృహదీశ్వరాలయం ఒకటి.

తమిళనాడులోని తంజావూర్( Thanjavur ) లో ఈ పురాతన శివాలయం ఉంది.ఇది చాలా ప్రత్యేకమైనది.

కాబట్టి దీనిని ఒక్కసారైనా తప్పక సందర్శించాలని భక్తులు అనుకుంటూ ఉంటారు.ఇంతకీ ఆలయం ప్రత్యేకత ఏంటి? ఆలయంలో ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

The Shadow Of This Temple Cannot Be Found No Matter How Much You Look For It..
Advertisement
The Shadow Of This Temple Cannot Be Found No Matter How Much You Look For It..

శివాలయం అయిన ఈ బృహదీశ్వరాలయాన్ని( Brihadeeswara Temple ) చోళ చక్రవర్తి రాజరాజ ఒకటి కాలంలో నిర్మించారు.ఆలయంలో చోళ రాజవంశం శిల్పకళా వైభవం ఒట్టిపడుతుంది.అలాగే ఈ ఆలయ నిర్మాణంలో అధునాతన ఇంజనీరింగ్ సాంకేతికతో సహా ఎన్నో అంశాలు కూడా ఉన్నాయి.

ఇది నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉన్నాయి.అది ఏంటంటే ఈ ఆలయం యొక్క నీడ ఎక్కడ వెతికిన కూడా కనిపించదు.మధ్యాహ్నం సమయంలో ఈ ఆలయం నీడ అస్సలు కనిపించదు.

దాని నీడ కింద పడదు.అదే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత.

The Shadow Of This Temple Cannot Be Found No Matter How Much You Look For It..

అయితే ఇది ప్రకృతి మర్మమా? అని నిపుణులు ఎంత వెతికిన దీని రహస్యం ఇప్పటికీ తెలియలేదు.ఇక ఇది ప్రపంచంలోనే ఎత్తైన దేవాలయాల్లో ఒకటి.అయినప్పటికీ మధ్యాహ్నం సమయంలో ఈ ఆలయం నీడ నేల మీద పడదు.

అప్పులు తీర్చే గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

అయితే ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో శిల్పిని రాజరాజ చోళులు ఈ ఆలయం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందా అని అడగ్గా.కనీసం నీడ కూడా పడదని బదులిచ్చాడు.

Advertisement

ఇక ఈ వింతను చూసి స్వయంగా రాజు శిల్పిని ప్రశంసలతో ముంచెత్తారు.ఇక ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది.

తాజా వార్తలు