నోట్ల కట్టలతో కొడుకుకి తులాభారం వేసిన రైతు.. ఎందుకంటే..?

మధ్యప్రదేశ్‌( Madhya Pradesh ) లోని ఉజ్జయినిలో ఓ రైతు తన కోరిక నెరవేరినందుకు గుర్తుగా తన కుమారుడి బరువుతో సమానమైన డబ్బును ఆలయానికి సమర్పించాడు.ఉజ్జయిని జిల్లాలోని బద్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది.

 The Farmer Who Burdened His Son With Bundles Of Notes.. Because..?, Social Medi-TeluguStop.com

ఇక్కడ ఒక రైతు చతుర్భుజ్ జాట్ తన కోరిక నెరవేర్చిన తర్వాత శ్రీ సత్యవాది వీర్ తేజాజీ మహారాజ్ ఆలయంలో ఈ విరాళాన్ని ఇచ్చాడు.రైతు చేసిన ఈ అపూర్వ విరాళం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

నిజానికి, రైతు చతుర్భుజ్ జాట్ 4 సంవత్సరాల క్రితం శ్రీ సత్యవాది ఆలయం( Sathyavadhi temple )లో తన 30 ఏళ్ల కుమారుడు వీరేంద్ర జాట్ కోసం ప్రార్థనలు చేశాడు.ఇది సఫలీకృతమైంది.దాంతో అతను తేజ దశమి నాడు దీనిని విరాళంగా ఇచ్చాడు.చతుర్భుజ్ జాట్ అనే రైతు ఏ ప్రతిజ్ఞ చేశాడో స్పష్టంగా తెలియనప్పటికీ, అతను తన కొడుకు బరువుకు సమానమైన మొత్తాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చాడు.

రైతు కొడుకు బరువు 83 కిలోలు.అందుకోసం ఆలయానికి విరాళం ఇవ్వడానికి సుమారు రూ.10 లక్షల 7 వేలు వసూలు చేయాల్సి వచ్చింది.ఇందుకోసం ఒక్కొక్కటి రూ.10 వేల విలువైన పలు కట్టలను ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు.ఇది రైతు, అతని కుటుంబంకి దేవుడి పై ఉన్న నామక్కని తెలియచేస్తుంది.

రైతు చతుర్భుజ్ జాట్, అతని కుటుంబం ఈ ప్రత్యేక సందర్భంలో తమ నమ్మకాన్ని నెరవేర్చడానికి ఒక ప్రత్యేక మార్గాన్ని అనుసరించారు.ఈ విరాళం ఆలయానికి ఆర్థిక సహాయం అందించడమే కాకుండా.

, సమాజంలో ధార్మిక, సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి ఒక మంచి ఉదాహరణను అందించిందని ఆలయ పండితులు, స్థానిక ప్రజలు ప్రశంసించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube