ఏ పార్టీలో లేనంత ఇంటిపోరు కేవలం కాంగ్రెస్లోనే ఉంటుందేమో.ఈ పార్టీలో ఎవరైనా ఎదుగుతున్నారంటే ఆయన్ను సొంత పార్టీ నేతలే కిందకు లాగేస్తుంటారు.
అందుకే ఈ పార్టీలో ఇంతవరకు పెద్ద బలమైన నేతలుగా ఎవరూ ఎదగలేదు.కేవలం వైఎస్సార్ లాంటి వారు మాత్రమే పెద్ద లీడర్లుగా రాణించారు తప్ప మిగతా వారెవరూ ఆ స్థాయిలో రాణించలేదు.
ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ విషయం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగిస్తే ఎంత పెద్ద రచ్చ జరిగిందో ఇప్పటికే చూస్తున్నాం.
ఇక రేవంత్ టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత ఏ స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తున్నారో చూస్తున్నాం.ఇప్పటికే కార్యకర్తలతో మీటింగులు పెట్టి బలోపేతం చేస్తున్నారు.ఇంకోవైపు సభలు, దండోరాలతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.ఇలాంటి తరుణంలో ఆయనమీద పిర్యాదులు కూడా బాగానే వెళ్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఆయన మీద అధిష్టానానికి ఫిర్యాదు అందినట్టు తెలిసింది.రేవంత్ రీసెంట్ గా ఢిల్లీకి వెళ్లడం వెనక కథ కూడా ఇదేనని తెలుస్తోంది.
ఓవైపు ఆయన టీఆర్ఎస్ మీద దూకుడుగా మాట్లాడుతున్నారు.
మరోవైపు సీనియర్లను పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తున్నారని చాలా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారంట సీనియర్ నేతలు.ఇక కొద్దిగా వస్తే ఏదో ఒకటి సర్ది చెప్పిన అధిష్టానం ఈ మధ్య మరీ ఎక్కువగా ఫిర్యాదులు వస్తుండటంతో సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇందుకోసం ఏకంగా రేవంత్ నే ఢిల్లీకి పిలిపించినట్టు సమాచారం.
అంతే కాదు ఆయన సీనియర్లను పట్టించుకోకపోవడం పట్ల క్లాస్ తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది.రీసెంట్ గా ప్రజాదర్భార్ జరిపే విషయంలో వస్తున్న ప్రచారం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లయింట్ చేయగా దీనిపై కూడా ఢిల్లీ పెద్దలు సీరియస్ అయ్యారంట.
.