హై వే జంక్షన్లో టెన్షన్...!

నల్లగొండ జిల్లా: మునుగోడు మండల పరిధిలోని మునుగోడు కమ్మగూడం నుండి చౌటుప్పల్ కు వెళ్లే రెండు వరసల రోడ్డుపై చొల్లేడు, కొండాపురం వెళ్లే రోడ్డు కలిసే జంక్షన్ లో సూచిక బోర్డులు లేకపోవడంతో ఎటు వెళ్ళాలో తెలియక కంగారులో ప్రయాణికులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు.ఇక్కడ తరచుగా ప్రమాదాల జరగడంతో అనేకమంది కాళ్లు,చేతులు విరిగి అంగవైకల్యం బారిన పడుతున్నారు.

 Tension At The Highway Junction, Highway Junction, Munugode, Kammagudem, No Sig-TeluguStop.com

అయినా ఆర్ అండ్ బీ అధికారులు తమకేమీ పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉండడంపై ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి చొల్లేడు కొండపురం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సూచిక బోర్డు ఏర్పాటు చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.

ఈ విషయమై ఆర్ అండ్ బీ మండల అధికారి పి.శిరిష్ కుమార్ ను వివరణ కోరగా చొల్లేడు కొండపురం రోడ్డుకు సూచిక బోర్డుకు ప్రపోజల్ పంపినామని,కానీ,సాంక్షన్ కాలేదని,రాగానే ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube