ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.కేసును సీబీఐకి అప్పగించడాన్ని సర్కార్ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది.
ఈ మేరకు హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.పిటిషన్ ను వెంటనే విచారణకు తీసుకోవాలంటూ సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే సీజేఐ ధర్మాసనాన్ని కోరారు.
సీబీఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ ధ్వంసం అయ్యే అవకాశం ఉందని దవే తెలిపారు.ఈ మేరకు పిటిషన్ ను రేపు న్యాయస్థానం దృష్టికి తీసుకువస్తే వచ్చే వారం విచారణను అనుమతిస్తామని సీజేఐ చంద్రచూడ్ వెల్లడించారు.