తెలంగాణాలో గత కొన్ని రోజులుగా తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి.అయితే, ఈ రోజు మాత్రం కరోనా కేసులు తక్కువగానే నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం.రాష్ట్రంలో తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 1,021 కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అలాగే , ఈ సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,214 మంది కోలుకున్నారు.ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,13,084 కి చేరింది.
ఇప్పటివరకు మొత్తం 1,87,342 మంది డిశ్చార్జ్ అయ్యారు.మృతుల సంఖ్య మొత్తం 1,228 కు చేరింది.
ప్రస్తుతం 24,514 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.జీహెచ్ ఎంసీ పరిధిలో కొత్తగా 228, రంగారెడ్డి జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి.
ఇక తెలంగాణలో జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలను చూస్తే … గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 228, ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 30, జగిత్యాల్ 31, జనగాం 12, జయశంకర్ భూపాలపల్లి 8, జోగులమ్మ గద్వాల్ 19, కామారెడ్డి 7, కరీంనగర్ 67, ఖమ్మం 24, కొమరం భీమ్ అసిఫాబాద్ 0, మహబూబ్ నగర్ 26, మహబూబాబాద్ 29, మంచిర్యాల 21, మెదక్ 9, మేడ్చల్ మల్కాజ్గిరి 84, ములుగు 9, నాగర్ కర్నూల్ 23, నల్గొండ 46, నారాయణ్పేట్ 1, నిర్మల్ 6, నిజామాబాద్ 26, పెద్దంపల్లి 23, రాజన్న సిరిసిల్ల 15, రంగారెడ్డి 68, సంగారెడ్డి 44, సిద్ధిపేట్ 41, సూర్యాపేట 22, వికారాబాద్ 9, వనపర్తి 24, వరంగల్ రూరల్ 16, వరంగల్ అర్బన్ 27, యాద్రాది భువనగిరి 20 కేసులు నమోదయ్యాయి.








