ఏపీలో తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.రాష్ట్ర అప్పు రూ.12.50 లక్షల కోట్లు దాటనుందని ఆరోపించారు.ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిపై రూ.5.50 లక్షల అప్పు భారం పడనుందని చెప్పారు.అప్పు తీర్చేందుకే ఆదాయం సరిపోతే.
ఇంకేం మిగులుతుందని ప్రశ్నించారు.అధిక అప్పులు, ఖర్చులపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని యనమల డిమాండ్ చేశారు.
కాగా రాష్ట్రం అధోగతి పాలైందని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.