అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ – జనసేన( TDP – Janasena ) సమావేశం రసాభాసగా మారింది.మహాసేన రాజేశ్( Mahasena Rajesh ) కు టికెట్ కేటాయించడంపై జనసేన పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే రాజేశ్ గో బ్యాక్ అంటూ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.దీంతో టీడీపీ – జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.
వివాదంలో భాగంగానే పి.గన్నవరం ఇంఛార్జ్ హరీశ్ మాధుర్ కారు అద్దాలను పార్టీ శ్రేణులు ధ్వంసం చేశారు.ఈ క్రమంలో సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది.