రాజధాని రైతుల మహా పాదయాత్ర కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు... దేవినేని ఉమా

రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.683 రోజులుగా రైతులు చేస్తున్న పోరాటం స్వాతంత్ర్య పోరాటం తరువాత అంతటి గొప్ప పోరాటం అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు పంటలు పండే భూములు ఇచ్చారని కాని మహిళలు దేవాలయలకు వెళ్తుంటే పెట్టిన ఆంక్షలు భయానక వాతావరణం తీసుకురావడానికి ఇటువంటి నిర్ణయలు తీసుకున్నారన్నారు.

రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని మీరు చేయబోయే ఈ పాదయాత్ర చరిత్రలో నిలుస్తుందన్నారు.పాదయాత్ర ఆపాలని చూసినా న్యాయస్థానం కాపాడిందని న్యాయస్థానం లేకపోతే ఈ దుర్మార్గులు ఎవరిని కూడా బ్రతకనివ్వరని ఉమా పేర్కొన్నారు.

మహిళలు తలుచుకుంటే ఏమైనా సాధిస్తారని రుజువు చేశారన్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు