'చందుర్తి మండలంలో ఇంటింటికి టీడీపీ'కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా :తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం మంగళవారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండల కేంద్రంలో ప్రారంభమైంది.వేములవాడ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

 'tdp Door To Door In Chandurthi Mandal' Programme-TeluguStop.com

ఈ సందర్భంగా పులి రాంబాబు మాట్లాడుతూ దళితులకు రాజకీయ చైతన్యం తెచ్చిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు.ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ లో రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు.

తదుపరి నారా చంద్రబాబునాయుడు ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఈ రోజు తెలంగాణ ప్రజలు పొందుతున్నారన్నారు.తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో చందుర్తి మండల పార్టీ లింగంపల్లి నంబారు వెంకయ్య,పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముంజ ఉమేందర్,చేనేత విభాగం పార్లమెంట్ అధ్యక్షుడు రిక్కమల్ల మనోజ్, వేములవాడ మండల పార్టీ అధ్యక్షులు చింతలకోటి రామస్వామి గౌడ్ తోపాటు సుబ్బాల భుమయ్య, తుమ్ము రాజు,మర్రి దేవరాజు, ముంగాని హన్మండ్లు, మర్రి రాజేశం,ధీకొండ హన్మండ్లు, కె.గంగయ్య,డి.లక్ష్మి,రాజం,పోశెట్టి రాజయ్య, నవీన్, లింగంపల్లి శంకర్,దుమ్మ లక్ష్మిరాజం.కట్కూరి భూమయ్య,లింగపల్లి మస్కట్ ,రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube