రైలు ఎక్కి దిగేటప్పుడు జాగ్రత్త అని మైకులో చెవులు బద్దలయ్యేలా మోగుతూ ఉన్నా పట్టించుకున్నవారే లేరు.తమిళనాడులో జరిగిన తాజా ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.
రైలు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎంత మొత్తుకున్నా రైల్వేవారి మాట వినకపోతే ఏం జరుగుతుందో ఈ ఘటన తెలిపింది.తమిళనాడులోని కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు.
దీంతో అతడు అదుపు తప్పి రైలుకు, ప్లాట్ఫాంకు మధ్యలో పడిపోబోయాడు.ఇది అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ పోలీస్ గార్డు గమనించి అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆ యువకుడు బతికి బట్టకట్టాడు.
అతడిని కింద పడకుండా పరిగెత్తి రైలులోకి బలంగా నెట్టేయడంతో అతడు రైలులోకి వెళ్లి పడ్డాడు.
ఇది చూసిన స్థానిక ప్రయాణికులు ఆ ఆర్పీఎఫ్ పోలీస్ గార్డును అభినందించారు.అతడి సమయస్ఫూర్తికి వారంతా సెల్యూట్ కొడుతున్నారు.రైల్వే అధికారుల ఎల్లవేళలా ప్రయాణికుల సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆ గార్డు అన్నాడు.
ఏదేమైనా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy