కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ కొనసాగుతోంది.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ పునరాలోచన చేస్తోందని తెలుస్తోంది.
అభ్యర్థుల విషయంలో నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.ఇవాళ రాత్రి సమయం కల్లా అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
కాగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ అభ్యర్థులుగా ఖరారు అయ్యారని ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.అయితే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసేందుకు రేపటి వరకే గడువు ఉంది.
నామినేషన్ల దాఖలకు సమయం దగ్గర పడగా .ఇప్పుడు పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడటంతో సస్పెన్స్ నెలకొంది.