బాధ్యులపై కఠిన చర్యలు..అధికారులకు ఏపీ డీజీపీ ఆదేశం

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత చోటు చేసుకుంటున్న హింసపై రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా( Harish kumar Gupta ) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్( Section 144) విధించారు.అదేవిధంగా పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలను హౌస్ అరెస్ట్( House arrest) చేసిన పోలీసులు వారి భద్రతలను కట్టుదిట్టం చేశారు.

ఈ క్రమంలోనే ఘటనకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు, రేంజ్ డీఐజీలకు, ఐజీలకు డీజీపీ హరీశ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు.జమ్మలమడుగు, పల్నాడు, తాడిపత్రి మరియు తిరుపతి జిల్లాల్లో జరుగుతున్న దాడులను డీజీపీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

పుష్ప 2 లో అసలైన ట్విస్ట్ ఇదే...అదిరిపోయిందిగా...
Advertisement

తాజా వార్తలు