ఒకే వేదికపై టాలీవుడ్ లెజెండ్స్.. ఒక్కటి చేయబోతున్న జక్కన్న.. ప్లాన్ అదుర్స్..

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.

ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.అయితే ఈ సినిమా విడుదల చేయాలనీ చూసినప్పుడల్లా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది.

పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ప్రకటించారు.భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాలో ఎన్ని హైలెట్స్ ఉన్నాయా అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.

ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.

Advertisement

ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.మరి ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాడు జక్కన్న.

మొన్నటి వరకు చేసిన ప్రొమోషన్స్ కు మించి ఇప్పుడు ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారం.

ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ ఈవెంట్ కు రాబోతున్న అతిథుల గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి రానున్నట్టు సమాచారం.

ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా ఇది నిజం అని చెబుతున్నారు.వీరిద్దరూ రావడం నిజం అయితే మాత్రం ఇటు నందమూరి అభిమానులు, అటు మెగా అభిమానులు ఇద్దరు కూడా పండగ చేసుకుంటారు.ఈ సినిమాలో నటించే హీరోల తండ్రులు ముఖ్య అతిథులుగా వస్తున్నారంటే జక్కన్న మ్యాజిక్ ఏ లెవల్ లో ఉందో అర్ధం అవుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇది నిజం అవ్వాలని అభిమానులంతా కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు