త్వరలో టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయి..మంత్రి జగదీశ్ రెడ్డి

యాంకర్.ఈ నెల 20 న నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభ కోసం నారాయణపురం,చండూర్ మండల్లాలో పలు స్థలాలను మంత్రి జగదీశ్ రెడ్డి పరిశీలించారు.

ఈ సభలో బిజెపి పరిపాలన, టిఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమంపై ముఖ్యమంత్రి స్పందిస్తారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.ఉప ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ మాకు పోటీ కానే కాదన్నారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసారు.దేశ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వామపక్షాల మద్దతు తమకే ఉంటుంది అని భావిస్తున్నామని పేర్కొన్నారు.

త్వరలో టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని చెప్పారు.

Advertisement
వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

తాజా వార్తలు