కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ ట్రైన్‎లో పొగలు.. భయాందోళనలో ప్రయాణికులు

కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ ట్రైన్( Coromandel Express )‎లో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి.దీంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఏలూరు నుంచి విజయవాడ( Vijayawada ) వైపు వెళ్తుండగా కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ ట్రైన్‎లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.వెంటనే గమనించిన అధికారులు రైలును అరగంట పాటు నిలిపివేశారు.

సాంకేతిక సిబ్బంది వచ్చి ట్రైన్ ను పరిశీలించిన తరువాత రైలును విజయవాడకు పంపించారు.అయితే ఎండ వేడిమి కారణంగా కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ ట్రైన్‎లో పొగలు వచ్చాయని ప్రాథమికంగా నిర్ధారించారు.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

తాజా వార్తలు