2023 సైమా వేడుకలకు హోస్ట్ గా వ్యవహరించనున్న రానా... మృణాల్ ఠాకూర్!

చిత్ర పరిశ్రమకు ఎన్నో అవార్డులను ప్రకటిస్తూ ఉంటారు.ఇలా చిత్రపరిశ్రమకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డులలో సైమా అవార్డ్స్ ( Siima Awards ) ఒకటి.

సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలను ప్రోత్సహిస్తూ ప్రకటించే ఈ అవార్డులు గత 11 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయి.అయితే ఈ ఏడాది సైమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాలకు కూడా ఏర్పాట్లు మొదలయ్యాయి.

అయితే ఈ అవార్డు వేడుకలను ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీలలో నిర్వహించబోతున్నట్లు సైమా చైర్ పర్సన్ బృందాప్రసాద ( Brunda Prasad ) వెల్లడించారు.

ఇక ఈ సైమా అవార్డుల వేడుకను ఈ ఏడాది దుబాయి( Dubai )లో జరగబోతున్నట్లు తెలియజేశారు.అంతేకాకుండా ఈ సైమా అవార్డు వేడుకలకు స్పాన్సర్ గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నెక్సా ( Nexa )స్పాన్సర్ గా వ్యవహరించునున్నట్లు ఈమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా నటి మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) రానా ( Rana )కూడా పాల్గొన్నారు.

Advertisement

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ దక్షిణాది సినీ పరిశ్రమను సైమా ఒకే తాటిపైకి తీసుకువచ్చిందని ఆయన వెల్లడించారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ వేడుకలలో తాను భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.

ఇక నటి మృణాల్ మాట్లాడుతూ.తన మొదటి సినిమా సీతారామం ( Sitaramam ) సినిమాతోనే తాను ఈ వేడుకలలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.దుబాయ్ లో జరిగే ఈ వేడుకలు పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం తాను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఈమె తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమానికి రానా, మృణాల్ ఠాకూర్ హోస్టుగా వ్యవహరించబోతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు