టాలీవుడ్ హీరో సిద్ధార్థ్( Siddharth ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సిద్ధార్థ్.
బొమ్మరిల్లు ,( Bommarillu movie )ఓయ్, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలలో నటించి మెప్పించారు.ఇక తెలుగులో చివరగా మహాసముద్రం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఇందులో శర్వానంద్ మరో హీరోగా నటించారు.ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు సిద్ధార్థ్.
ఇది ఇలా ఉంటే సిద్ధార్థ్ >( Siddharth )కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం చిత్తా.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెలుగు తెరకెక్కనున్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ మూవీ తెలుగులో అక్టోబర్ 6న చిన్నా అనే పేరుతో విడుదల కానుంది.విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందంతో పాటు సిద్ధార్థ్ కూడా ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా గడుపుతున్నాడు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఓ స్టార్ హీరో సినిమా చూసి తాను వెక్కి వెక్కి ఏడ్చానని తెలిపారు.ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ.
నేను కమల్ హాసన్ సర్కు( Kamal haasan ) వీరాభిమానిని.ఇటీవల ఆయన్ని కలిశాను.
ఎన్నో విషయాల గురించి మేము మాట్లాడుకున్నాము.ముఖ్యంగా విచిత్ర సోదరులు చిత్రీకరణ నాటి అనుభవాలను ఆయన నాతో పంచుకున్నారు.ఆయన మాటలు విని నేను భావోద్వేగానికి గురయ్యాను.సర్ నాకెందుకో బాధగా ఉంది.మీరు మాట్లాడుతుంటే ఆ సినిమా చూసిన క్షణాలు నాకు గుర్తుకువస్తున్నాయి.తొమ్మిదేళ్ల వయసులో మా అమ్మతో కలిసి ఆ సినిమా చూశాను.
సినిమాలోని రిజిస్టర్ ఆఫీస్ సీన్ చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చాను.ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ సీన్ గుర్తుకువచ్చింది అని చెప్పా అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు.